బోథ్, జూన్ 23: బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఐటీడీఏ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి రోడ్ల విషయమై విన్నవించారు. ఇది వరకు ఐటీడీఏ నిధులతో చేపట్టిన గ్రావెల్ రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వీటిని బీటీ రోడ్లుగా మలచడంతో పాటు కొత్తగా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణ్సింగ్, భీంపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు కళ్లెం శ్రీనివాస్రెడ్డి, జీ నరేందర్యాదవ్, వినోద్యాదవ్ ఉన్నారు.