జన్నారం, ఫిబ్రవరి 3 : కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ అడవుల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్న బర్డ్వాక్ ఫెస్టివల్కు ఎఫ్డీవో మాధవరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బర్డ్వాక్ నిర్వహించారు. అప్పుడు మహారాష్ట్ర, హైదరాబాద్తో పాటుగా వివిధ జిల్లాల నుంచి 65 మంది పక్షుల ప్రేమికులు తరలివచ్చారు. ప్రస్తుతం ఈ నెల 4,5 తేదీల్లో మొదటి విడుత చేపట్టానున్నారు. డివిజన్లోని నీలుగాయికుంట, మైసమ్మకుంట, బైసన్కుంట, కలపకుంట ప్రాంతాల్లో పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి కావాల్సిన ఆహారాన్ని అటవీ సిబ్బంది సమకూర్చడంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు వలసవచ్చి ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. నీటికుంటల్లో చేప పిల్లలు వేయడంతో పాటుగా వాటికి ఆహారం కొరత లేకుండా చూస్తున్నారు. గతంలో కంటే ఈ సారి రెట్టింపు మంది వస్తారని అటవీ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు.
అడవుల్లోనే బస..
రిజిస్ట్రేషన్ చేసుకున్న పక్షుల ప్రేమికులను ఎఫ్డీవో మాధవరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోజన వసతి, సఫారీల ద్వారా అడవుల్లోకి తీసుకువెళ్లి పక్షులను తిలకించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రుల్లో అడవుల్లో ఉండేందుకు డేరాలను ఏర్పాటు చేశారు. పక్షులను తిలకించేందుకు ఇందన్పెల్లి , జన్నారం, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్లు ఏర్పాట్లు కల్పించినట్లు తెలిపారు. రెండో విడుత ఫిబ్రవరి 18,19 తేదీల్లో నిర్వహించనున్నారు.