‘4న సీఎం కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి.. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.. సభను విజయవంతం చేయాలి.. మహబూబ్నగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు’.. అని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. చిన్న పొరపాటు కూడా జరుగకుండాచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ కృషితోనే పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
మహబూబ్నగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్కు వచ్చేనెల 4న సీఎం కేసీఆర్ రానున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చే యాలని, ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. పాలమూరులోని నూతన కలెక్టరేట్తోపాటు పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలకొండ వద్ద క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రారంభోత్సవం నుంచి బహిరంగ సభ వరకు పట్టణమంతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిన్న పొరపాటు కూడా లేకుండా సక్సెస్ చేయాలన్నారు. అనంతరం పెద్దచెరువు వద్ద అద్భుతంగా నిర్మిస్తున్న శిల్పారామం, ఇతర అభివృద్ధి పనులను తీర్చిదిద్ది పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువు చుట్టూ నక్లెస్రోడ్డు, శిల్పారామం, మినీట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్ సుందరీకరణ పనుల్లో వేగవంతం చేయాలని సూచించారు. ప్రగతి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారని తెలిపారు. చిన్నారుల సాహస క్రీడల వేదికగా శిల్పారామం, మినీ ట్యాంక్బండ్ను మారుస్తామని చెప్పారు. అన్ని పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేసేందుకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు న్న వాలీబాల్ అకాడమీని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 1 నుంచి అకాడమీ కోసం క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు హాజరుకావాలని కోరా రు. 14 నుంచి 18 ఏండ్ల వయసున్న బాలబాలికల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తారన్నారు. అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను తయారు చేసేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని కో రారు.
క్రీడాకారుల కోసం ఎలాంటి సదుపాయాలైన అందిస్తామని, అత్యుత్తమ క్రీడాకారులకు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో బాక్సర్ నిఖత్జరీన్, టేబుల్టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ అత్యున్నత ప్రతిభ కనబర్చి అర్జున అవార్డుకు ఎంపికయ్యార న్నారు. క్రీడాకారులకు సౌకర్యాలు, ప్రోత్సాహం అం దించడం వల్లే సాధ్యమైందన్నారు. ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, టూరిజం ఎండీ మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఉన్నారు.