కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 11 : ఐఐటీ అడ్వాన్స్డ్లో-2022 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ర్యాంక్లు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని వావిలాలపల్లి క్యాంపస్లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినం దించి మాట్లాడారు. అల్ఫోర్స్ విద్యార్థులు ఐఐటీ ఫలి తాల్లో వివిధ కేటగిరీల్లో అద్భుత ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీలో సీటు వచ్చే విద్యార్థు లు ప్రతి ఒక్కరూ ఆయా కళాశాలల్లో చేరాలని, ఐఐటీలో డిగ్రీ పట్టా పొందడం ఎంతో గర్వకా రణమన్నారు. ఈ క్రమంలో కళాశాలకు చెందిన ఈశ్వర్ రాథోడ్ 625వ ర్యాంక్, విశ్వనాథ్ రెడ్డి 658, సాత్విక్ 758, సాయి కౌశిక్ 926, నిష్రాంత్ రెడ్డి 961, అజ్మీరా గగన్ నాయక్ 1093, ఆరా 1124, రాం భువనేశ్వర్ 1184, దీక్షిత్ నాయక్ 1269, ముదావత్ శ్రీ రామ 1285, నవదీప్ 1822, సిరి చందన 2209, విజయ్ సాత్విక్ 2302, కే ధీరజ్ రెడ్డి 2777, డీ అపూర్వ 3020, ఎన్ హర్షిత్ 3390, విరినిచి 3624, సాయి శివ చరణ్ 3804, సీహెచ్ సుప్రీమ్ 3813, పీ చైతన్య 4222, ఎస్ ఆకాశ్ 4250, డీ కార్తికేయ 4439, లాస్య 4827, అభిజ్ఞ 4852, శశిప్రీతమ్ 4967, కే వాణి వికాస సాయి శ్రీ రేష్మిత 5080, రాజ విఘ్నేశ్ 5111, కల్యాణ్ సాత్విక్ 5172, శార్వాణి 5949, ఎస్ వికాస్ కుమార్ 7336, ప్రీతమ్ కుమార్ 8765, ప్రిపరేటరీ విభాగంలో సాయి రోహన్ 26వ ర్యాంక్, సుష్మా సుల్తాన్ 1065, గుమ్మడి ఐశ్వర్య దీపిక 1818, గంధం హర్షిణి 2283, ఎస్ అభినవ్ 2636, రిశ్విత్ 3380 ర్యాంక్ సాధిం చారని పేర్కొన్నారు. 5వేల లోపు ర్యాంక్లు 30 మంది, 10వేల లోపు 36 మంది విద్యార్థులు ర్యాంక్లు సాధించారన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధనతో ఇది సాధ్యమైందన్నారు.
దేశంలోని అత్యుత్తమ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగాను. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం సహకారంతో మంచి ర్యాంకు వచ్చింది. బోధన సిబ్బందితో పాటు నరేందర్ రెడ్డి సార్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బోధనతోనే ఇది సాధ్యమైంది.
– విశ్వనాథ్రెడ్డి, 658వ ర్యాంక్
నాకు ఐఐటీ అడ్వాన్స్డ్ లో 758వ ర్యాంక్ వచ్చిం ది. సీఎస్సీ లేదా ఈసీలో సీటు వస్తుంది. ఇది నాతో పాటు తల్లిదండ్రులకు ఆనందం కలిగించే విష యం. రానున్నది కంప్యూట ర్, ఎలక్ట్రానిక్ యుగం. దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే, మంచి సంస్థల్లో ఉద్యోగావకాశాలు వస్తాయి.
– సాత్విక్, 758వ ర్యాంక్
నాకు ప్రిపరేటరీ విభాగంలో దేశ వ్యాప్తం గా 26వ ర్యాంకు వచ్చిం ది. ప్రిపరేటరీ విభాగం లో సీటు రావడం వల్ల నేను ఒక సంవత్సరం ఎక్కువ డిగ్రీ చదవాల్సి ఉంటుంది. ఇది అల్ఫోర్స్ యాజమాన్యం నాకు అందించిన మంచి అవకాశంగా భావిస్తున్నా.
– సాయి రోహన్, 26వ ర్యాంక్