భైంసా, అక్టోబర్, 4 : గట్టుమైసమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఇప్పటికే దేవా దాయ శాఖ నుండి ఆలయ నిర్మాణానికి రూ. 30 లక్షల వరకు నిధులు మంజూరు చేశామన్నారు. అంతేకాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారం అందిస్తానన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు బామ్ని రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు పోశెట్టి, శంకర్, గట్టు, తదితరులు ఉన్నారు.
స్వరాష్ట్రంలో అన్ని వర్గా లకు సీఎం కేసీఆర్ సముచిత ప్రాధాన్యం ఇస్తున్నా రని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాంగ్ర గ్రామంలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించిన మరాఠ సంఘ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందు గా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేసీఆర్ పథకాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ అమలు కావడం తథ్యమ ని పేర్కొన్నారు. కార్యకర్తలు ఇతర పార్టీల మాటల ను నమ్మి మోసపోవద్దని కష్టించి పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, అనిల్, దిగంబర్ పటేల్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.