కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కలెక్టర్ రాహుల్ రాజ్
‘భారత్ కి ఆజాద్కా అమృత్ మహోత్సవం’పై అవగాహన
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, ఆగస్టు 22 : రోడ్లతోనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీకి సంబంధించి నిర్వహించిన ‘భారత్ కి ఆజాద్కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. 2000 సంవత్సరంలో ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగిందన్నారు.. జిల్లాలో ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ మూడో దశ నడుస్తుందని చెప్పారు. దీని ద్వారా ఇప్పటివరకు 47 వంతెనన పనులు పూర్తి చేయగా, అలాగే 678 కిలోమీటర్ల రోడ్లు వేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 235 హ్యాబిటేషన్లు లబ్ధి పొందాయని తెలిపారు. నూతన టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఉపయోగపడుతుందని, దీనికోసం ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ వెంకట్రావు, ఈఈ రామ్మోహన్రావు, ఎస్క్యూఎంపీవీ. రామచంద్రన్, టెరజెమ్ ఇంజినీర్ సుమన్ అధికారులు పాల్గొన్నారు.