మౌలిక నిధులతో మెరుగుపడనున్న పాఠశాలలు
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తే పల్లెల్లో విద్య పండుగలా మారుతుందని రాష్ట్ర అట వీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. కేజీటూ పీజీ విద్యను అందించడంలో భాగంగా సీఎం కేసీఆర్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,360 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో తొలి విడుత కింద 735 పాఠశాలల్లో 260 పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, నీటి సరఫరా, ఫర్నిచర్, మరమ్మతులు, గ్రీన్చాక్బోర్డు, ప్ర హరీలు, వంటశాల లు, డిజిటల్ విద్య త దితర సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగించుకోవచ్చ ని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, మున్సిపల్ చైర్మన్ గం డ్రత్ ఈశ్వర్, డీఈ వో రవీందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో వేగంగా అభివృద్ధి
లక్ష్మణచాంద, ఫిబ్రవరి 14 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని బోరిగాం గ్రామంలో 50 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ. 21.37 కోట్లతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాంల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి జరుగుతుందనడానికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనమన్నారు. వెల్మల్ బొ ప్పారంలో ఏర్పాటుచేసిన 400 కేవీ సబ్ స్టేషన్తో ప్రస్తుతం ఒక్క క్షణంకూడా విద్యుత్ కోతలు ఉం డడం లేదన్నారు. బోరిగాంలో గతంలోనే 25 డ బుల్ బెడ్రూంలు ఇచ్చామని తెలిపారు. 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాం నిర్మించ డం ద్వారా ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా తెలుస్తుందన్నారు. జడ్పీ చైర్పర్సన్ కొరపెల్లి విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ గుజ్జారి గణేశ్, నాయకులు అడ్వాల రమేశ్, కేశం రమేశ్, ఈటల శ్రీనివాస్, ఆర్డీవో రమేశ్రాథోడ్, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, ఈవోపీఆర్డీ నసీరొద్దీన్ పాల్గొన్నారు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
మామడ, ఫిబ్రవరి 14 : మండలంలోని కొరిటికల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అనంతరం కొరిటికల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కరోనాతో మరణించగా.. అతని భార్య సుగుణకు రూ.1.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అదే గ్రామానికి చెందిన ఓ పద్మ అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందగా.. ఆమెకు రూ.20వేల చెక్కును అందజేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాం కిషన్రెడ్డి, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, ఏవో ప్రవీణ్, నిర్వాహకులు రజిత, పప్పిసేట్, నాయకులు సురేందర్రెడ్డి, నల్ల లింగారెడ్డి, రమేశ్రెడ్డి, రఘు, రాజేశ్వర్, శశికాంత్రెడ్డి పాల్గొన్నారు. అ నంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శివాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ హన్మాగౌడ్, నాయకుడు మేకం అశోక్ పాల్గొన్నారు.