హైదరాబాద్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాల గడువును పొడిగించామని, విద్యార్థులు www.braouonline.in వెబ్సైట్ చూడాలని రిజిస్ర్టార్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. సమాచారం కోసం 73829 29570/ 580 లేదా సమాచార కేంద్రాల్లో 040-23680 290/291/ 294/295 సంప్రదించాలని సూచించారు.