ప్రస్తుతం ప్రతి చిన్నసమస్యకూ ఆపరేషన్ చేయించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, పుట్టుకతో వచ్చిన అవయవాలను కృత్రిమ అవయవాలతో భర్తీ చేసి, కాలం వెళ్లదీయడం ఎంతవరకూ సమంజసం? చిన్న సూది మందుతో పరిష్కారం దక్కే వీలున్నప్పుడు, సర్జరీ వెంట పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది? మృదులాస్థిని సహజసిద్ధంగా వృద్ధి చెందేలా చేసి.. మోకాలి నొప్పిని దూరంచేసే చికిత్సా విధానం గురించి డాక్టర్ సుధీర్ దారా వివరిస్తున్నారు.
ప్లాస్మా చికిత్స ఎలా పని చేస్తుంది?
రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు చాలా చిన్నవి. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో వీటిదే కీలక పాత్ర. మోకీళ్లలో మృదులాస్థి దెబ్బతిన్నప్పుడు మోకాలి నొప్పులు మొదలవుతాయి. ఇలా దెబ్బతిన్న ప్రదేశంలోకి ప్లేట్లెట్లతో నిండిన ప్లాస్మాను ఇంజెక్ట్ చేస్తారు. దాంతో కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసే కారకాలు ప్రేరేపితం అవుతాయి. ఫలితంగా మొత్తం కణజాలం
పునరుత్పత్తి చెందుతుంది.
లాభాలు ఇవే..
కేవలం 30 నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. ఇది మోకాళ్ల మార్పిడిలాంటి శస్త్రచికిత్స కాదు. చిన్న ఇంజెక్షన్తో కూడిన చికిత్స కాబట్టి నొప్పి, రక్తస్రావం ఉండదు. చికిత్స తర్వాత ఎటువంటి ఇబ్బందీ లేకుండా వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇన్ఫెక్షన్లు, దుష్ప్రభావాల బాధలూ ఉండవు. చికిత్స ప్రారంభం నుంచే నొప్పి తగ్గుముఖం పట్టి, ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు. మోకాలి చికిత్సల్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను మించిన సమర్థమైన విధానం మరొకటి ఉందని ఇంతవరకూ నిరూపితం కాలేదు. దీనికి బెడ్ రెస్ట్ అవసరం లేదు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది సహజమైన, సౌకర్యవంతమైన మార్గం. ఈ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎపివన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మోకాళ్లు, భుజాల నొప్పులకే కాకుండా.. నడుము నొప్పి, మైగ్రేన్ తలనొప్పి, స్పాండిలైటిస్, సయాటికా లాంటి అన్ని దీర్ఘకాలిక నొప్పులకూ ఆపరేషన్ లేకుండా ఆధునిక చికిత్సలు లభిస్తాయి.
అవార్డులు పొందిన ఆసుపత్రి..
మోకీళ్ల ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పుల నివారణపరంగా అందిస్తున్న సేవలకుగాను, EPIONE సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కేర్ అవార్డు లభించింది. దక్షిణ భారతదేశంలో మోకీళ్ల ఆస్టియో ఆర్థరైటిస్కు ఎక్కువ సంఖ్యలో నాన్ సర్జికల్ ప్లాస్మా థెరపీలను చేసినందుకుగాను ఆసుపత్రికి ఈ అవార్డును అందజేశారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా అవార్డును అందుకొన్నారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్..
అత్యధిక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఈఆర్పీ) చికిత్సలు చేసినందుకు గుర్తింపుగా డాక్టర్ సుధీర్ దారాకు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ను ప్రదానం చేసింది. మోకాలి నొప్పి, భుజాల నొప్పి, యాంకిల్తోపాటు అన్ని రకాల ఇతర కీళ్లకు సంబందించిన నొప్పులకు ఈ థెరపీతో చికిత్స అందించారు. 2018 అక్టోబర్ నుంచి, 2022 ఫిబ్రవరి వరకూ డాక్టర్ సుధీర్ దారా, 3500 ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలను విజయవంతంగా ముగించారు.
డాక్టర్ సుధీర్ దారా
MBBS, M DIAPM
ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ EPIONE,
సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ బియాండ్.
ఫోర్త్ ఫ్లోర్, అపురూప పీసీహెచ్, రోడ్ నెంబరు 2, బంజారాహిల్స్, హైదరాబాద్ – 33
ఫోన్: 875-875-875-1, 84660 44441