ఆరోగ్యానికి పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. పాలు, పసుపు, నల్ల మిరియాలు, అల్లం, దాల్చిన చెకతో తయారు చేసిన హల్దీ దూద్ ఏ కాలానికైనా అనువైన పానీయమే! ఇందులో ఆరోగ్యానికి సాయపడే యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు ఉండటంతో మన శరీరానికి కావాల్సిన వెచ్చదనం లభిస్తుంది.
సాధారణ జలుబు, ఫ్లూతో బాధపడేవారికి… కీళ్ల నొప్పులు, కండరాల సమస్యతో ఇబ్బందిపడే వృద్ధులకు హల్దీ దూద్ ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది నిద్రపోయే ముందు పసుపు పాలు తాగుతుంటారు. అలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అధిక కేలరీలు ఉండే హల్దీ దూద్ తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుందట. పాలు తాగిన వెంటనే పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి.
రాత్రి భోజనం కడుపు నిండుగా తిన్నతర్వాత పాలు తాగడం వల్ల ఉబ్బరం పెరుగుతుంది. వీలైతే రాత్రి భోజనానికి ముందు పాలు తాగడం మంచిది. దీనివల్ల ఆహారాన్ని కూడా మితంగా తీసుకున్నవాళ్లమవుతాం. భోజనం తర్వాత వెంటనే పాలు తాగకుండా కనీసం ఒకటి రెండు గంటల తర్వాత వెచ్చని పసుపు పాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇందులో చకెరను నివారించడం ఎంతో ముఖ్యం. అప్పుడే జీర్ణక్రియపై ఒత్తిడి తగ్గుతుంది.