నటి తాప్సీ పన్ను ఇటీవల తాను సోషల్ మీడియాలో ఎందుకు తక్కువగా కనిపిస్తున్నానో వివరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్లను సృష్టించడం, వాటిలో పాల్గొనడం, నిరంతరం యాక్టివ్గా ఉండాలనే తపన తనకు ఒత్తిడి కలిగించడం వల్లే.. సామాజిక మాధ్యమాలకు కొంత దూరం పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ‘నేను సోషల్ మీడియాను తగ్గిస్తానని ఎలాంటి ప్రకటనా చేయలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎప్పుడూ ట్రెండ్లను ప్రారంభించడం లేదా వాటిలో పాల్గొనడం ఒక పోటీలా అనిపించింది. అది చాలా అలసటను కలిగించింది.
నేను నా జీవితాన్ని జీవించాలని అనుకున్నాను, సోషల్ మీడియాను నిరంతరం చెక్ చేయడమే జీవితంగా అనుకోవడం లేదు. ఈ పరుగు నాకొద్దు అనిపించింద’ని పేర్కొన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కొన్ని బ్రాండ్ అవకాశాలు కూడా తగ్గినట్టు తాప్సీ అంగీకరించింది. లైక్స్, షేర్లు, అల్గారిథమ్స్ కోసం పనిచేయడం కన్నా.. నిజాయతీ, వ్యక్తిత్వం ముఖ్యమని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తాజా వ్యాఖ్యల ద్వారా తాప్సీ తన వ్యక్తిగత జీవితానికి, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.