ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో పుట్టిన స్వాతి మలివాల్ బాల్యంలోనే తన చుట్టూ ఉన్న లింగవివక్షను గమనించారు. భరించారు. గట్టిగా ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే జర్నలిజంలో డిగ్రీ చేసి పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. కలం యోధురాలిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, క్షేత్రస్థాయిలో మహిళల సమస్యల పట్ల మరింత అవగాహన పెరిగింది. వాటిని పరిష్కరించేందుకు తన వంతుగా ‘రక్ష’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
మహిళా సాధికారత లక్ష్యంగా, గృహహింస, లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా… ఆమె చేస్తున్న కృషి జాతీయ నాయకుల దృష్టికి వెళ్లింది. తనను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నియమించారు. స్వాతి ఆ పదవిని చాలా సమర్థంగా నిర్వహించారు. మహిళలపై అన్యాయాలకు వ్యతిరేకంగా పదునైన చట్టాలను ప్రయోగిస్తూనే… స్త్రీల ఉన్నతి కోసం మెరుగైన అవకాశాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ‘రేప్ రోకో’ పేరుతో అత్యాచార నిర్మూలనకు ఆమె ఇచ్చిన నినాదం అపార ప్రభావం చూపింది. శాంతిభద్రతల పరిరక్షణను న్యాయ వ్యవస్థతో అనుసంధానిస్తూ స్వాతి చేసిన ప్రయోగం విజయవంతమైంది.