కావలసిన పదార్థాలు
రాజ్మా: ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, శనగపిండి: పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, ధనియాలు, జీలకర్ర పొడి: ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా
తయారీ విధానం
ముందుగా రాజ్మా, ఆలుగడ్డలను వేరువేరుగా ఉడికించుకుని మెదుపుకోవాలి. ఇప్పుడు రాజ్మా మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. శనగపిండి, తగినంత ఉప్పు, అల్లం, ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని.. కొద్దికొద్దిగా తీసుకుని బుల్లెట్ల ఆకారంలో చేసుకోవాలి. స్టవ్మీద పాన్ పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి, కొంత వేడయ్యాక బుల్లెట్లను వేసి రెండు వైపులా తిప్పుతూ సన్నని మంటమీద కాల్చుకుంటే రాజ్మా బుల్లెట్స్ రెడీ.