మెట్రోలతో పోలిస్తే.. కిందిస్థాయి నగరాల్లో నాణ్యమైన ఔషధాల కొరత తీవ్రంగా ఉంటుంది. ఒక బ్రాండ్ ఉంటే.. మరో బ్రాండ్ ఉండదు. రాజస్థాన్కు చెందిన ఆస్తా దుసాద్ ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టారు.
పట్టణ ప్రాంతాల్లో మందుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ‘మెడ్ డెలివరీ’ పేరుతో ఓ స్టార్టప్కు ప్రాణం పోసింది ఆస్తా దుసాద్. ఇదొక ఫార్మా-టెక్ స్టార్టప్. ప్రముఖ ఫార్మా కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేస్తుంది. వాటిని చిన్నచిన్న పట్టణాల్లోని మెడికల్ షాపులకు విక్రయిస్తుంది. జైపూర్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థను అన్ని ప్రధాన, కిందిస్థాయి నగరాలకు విస్తరించాలని చూస్తున్నది ఆస్తా.
ఇప్పటికే 15 లక్షల మెడికల్ షాపులను చేరుకున్నది మెడ్ డెలివరీ. రానున్న 18 నెలల్లో మరో 50వేల షాపులకు చేరువకావాలన్నది లక్ష్యం. తాజాగా బిజినెస్ టు బిజినెస్ (బీటుబీ) నుంచి డైరెక్ట్ టు కస్టమర్ (డీటుసీ) ప్లాట్ఫామ్లోకీ అడుగుపెట్టింది. ఈ స్టార్టప్ 40 మందికి ప్రత్యక్షంగా.. ఎంతోమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది.
రోజూ 3 వేలమందికి పైగా కస్టమర్లు 5 లక్షల ఉత్పత్తులను మెడ్ డెలివరీ నుంచి కొనుగోలు చేస్తున్నారట. ‘ఆహార రంగంలో స్విగ్గీ-జొమాటో, రవాణా రంగంలో ఉబెర్- ఓలా ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయో మనకు తెలుసు. ఔషధ పంపిణీ విభాగంలోనూ మేం అంతే ముఖ్యమైన స్థానాన్ని ఆశిస్తున్నాం’ అంటారు ఆస్తా.