‘గుంటూరు కారం’ ఘాటును సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న పాట ‘ఓ మై బేబీ’. టింగ్లిష్ లిరిక్స్తో సాగిపోయే ఈ పాటకు శిల్పారావు హస్కీవాయిస్ అదనపు కిక్కునద్దింది. కర్ణాటక సంగీతంతో అచ్చికలాడిన ఆమె గళం.. హిందుస్థానీ రాగాలనూ అలవోకగా పలికించగలదు. మెలోడీ టు పాప్ ఏ రకం పాట ఇచ్చినా తన పాటవంతో మెప్పించడం ఆమెకు రివాజు. సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్న శిల్పారావు జీవిత గమకాల సంగతులు ఆమె మాటల్లోనే..