కథానాయిక కియారా అద్వాణి మీడియాపై గుర్రుగా ఉంది. నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో డేటింగ్పై ఫుల్ క్లారిటీ రాకముందే ఇద్దరికీ బ్రేకప్ అయిందన్న వార్తలూ బీటౌన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ పుకార్లపై స్పందించనని కాస్త ఘాటుగానే జవాబిచ్చింది కియారా. ‘ఎవరికి తోచింది వాళ్లు ఊహించేసుకుని రాసేస్తున్నారు. పోనీ ఏదైనా స్పందించినా, మనం చెప్పింది కాకుండా వాళ్లు అనుకున్నదే రాస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు వీటిపై తప్పకుండా మాట్లాడతా’ అని చెప్పుకొచ్చింది కియారా. ‘ఇలాంటి పుకార్లు ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటాయి. వాటిని ఎదుర్కొనే తత్వం నాకింకా అలవాటు కాలేదు కాబోలు! సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్స్ గురించే ఆలోచిస్తూ కూర్చునే రకం కూడా కాదు! ఇప్పటివరకు నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం సంతృప్తి కరంగా ఉన్నాయి’ అంటూనే డేటింగ్ విషయాన్ని దాటవేసింది కియారా.