మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి మంచి సంబంధం రావడంతో పెండ్లి చేసి పంపించాం. కొడుకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో నేను, మా ఆయన మాత్రమే ఉంటున్నాం. కరోనా ముందు వరకు రోజూ ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ చేసేవాళ్లం. అప్పుడప్పుడూ విహార యాత్రలకు వెళ్లేవాళ్లం. సరదాగా సమయం గడిపేవాళ్లం. కానీ ఇప్పుడు గడప దాటడం లేదు. ఇంట్లో ఒంటరిగా అనిపిస్తున్నది. పిల్లల మీద బెంగగా ఉంటున్నది. ఈమధ్య మా ఇద్దరిలోనూ భయం, కోపం, నిరుత్సాహం ఎక్కువైపోయాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో చెప్పండి.
జ : మీ ఇద్దరి మానసిక స్థితిని ‘ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. పిల్లలతో మానసికంగా చాలా దగ్గరగా ఉండేవాళ్లు, వివిధ కారణాలతో బిడ్డలు తమకు దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి మనోస్థితికి లోనవుతారు. గూటిని వదిలి పిల్ల పక్షులు ఎగిరిపోయినప్పుడు, తల్లి పక్షి అనుభవించే ఒంటరితనాన్నే మీరూ అనుభవిస్తున్నారు. అయితే, ఇదంతా ఎక్కువకాలం ఉండదు. రోజులు గడుస్తున్నకొద్దీ జీవితంలో మీ ముందున్న లక్ష్యమేమిటో తెలుస్తుంది. అయితే ఆ మార్పును స్వీకరించడానికి మనం, ఏ వయసులోనైనా సరే సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి. పిల్లలకు అమ్మానాన్నల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మానసికంగా వాళ్లలో ధైర్యం, స్థయిర్యం నింపాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వీడియో కాల్స్తో పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. బంధువులు, స్నేహితులను ఫోన్లో పలకరిస్తూ ఉండండి. ఇలా, అయినవాళ్ల సాన్ని
హిత్యంతో ‘ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్’ను అధిగమించవచ్చు. మీరిద్దరూ కూడా పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWICH NOW
హైదరాబాద్