మహిళ వడ్డనలో అన్నపూర్ణ, ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు లక్ష్మి. దుబారా ఇష్టపడదు. వృథా ప్రోత్సహించదు. డబ్బును గౌరవిస్తుంది. శ్రమను ప్రేమిస్తుంది. కాబట్టే, భారతీయ మహిళల క్రెడిట్ స్కోర్ ఏటికేడాది పెరుగుతున్నది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంలో పురుషులతో పోలిస్తే మహిళలే ముందున్నట్టు ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థ నిర్వహించిన తాజా ఆధ్యయనంలో తేటతెల్లం అయింది.
అంతేకాదు తీసుకున్న రుణాలను ఎంతో బాధ్యతగా తీరుస్తూ స్కోర్ పెంచుకుంటున్నారని కూడా కితాబు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా దాదాపు 53 శాతం మంది మహిళలు 731-770కి మించి సిబిల్ స్కోర్ కలిగి ఉన్నారు. దీంతో కొత్త రుణాలు వేగంగా మంజూరు అవుతున్నాయి. గత ఐదేండ్లలో మహిళా రుణగ్రహీతలు 19 శాతం పెరిగారు. భవిష్యత్తులో గృహరుణాలు తీసుకునేవారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.