లక్నో : ఉత్తరప్రదేశ్లో కొవిడ్ వ్యాక్సన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు. ఈ ఘటన షామ్లీ జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. ముగ్గురు వృద్ధ మహిళలకు కొవిడ్ -19 వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రేబిస్ మోతాదులు ఇచ్చినట్లు గుర్తించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
డెబ్బై ఏళ్ల సరోజ్ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తరువాత మైకం కమ్మినట్లుగా అనుభూతి చెందింది. అనంతరం ఆమెను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా.. ఆమె టీకా ప్రిస్క్రిప్షన్లో ‘యాంటీ రాబిస్’ రాసినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే, 72 ఏండ్ల వయసు ఉన్న అనార్కలి, 62 ఏళ్ల సత్యవతి అనే మరో ఇద్దరు మహిళలకు కూడా ఇలాంటి ప్రిస్క్రిప్షన్లు ఇచ్చినట్లు తరువాత తెలిసింది.
సీఎంఓ డాక్టర్ సంజయ్ అగర్వాల్ ప్రకారం, ఆరోగ్య కేంద్రంలోని రెండు వేర్వేరు అంతస్తుల్లో యాంటీ రేబిస్, కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే, ఈ మహిళలు ఒక అంతస్థుకు వెళ్లాల్సి ఉండగా మరో అంతస్థుకు రావడంతో అక్కడ ఇస్తున్న యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఒక డోసు ఇచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఇందులో తమ తప్పిదం లేదని వాదిస్తున్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది. రాబిస్ వ్యాక్సిన్ కోసం రావడం తోనే ఆ వ్యాక్సిన్ ఇచ్చామని వారు వాదిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) సంజయ్ అగర్వాల్ తెలిపారు. అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తారని జిల్లా మేజిస్ట్రేట్ జస్జిత్ కౌర్ ప్రకటించారు. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలు రికార్డ్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో ఎవరు దోషిగా తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జస్జిత్ కౌర్ అన్నారు.
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..