హైదరాబాద్, జూన్ 25( నమస్తే తెలంగాణ) : కోస్టారికా రాయబారి క్లాడియో అన్సోరెనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను శుక్రవారం బీఆర్కే భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని సీఎస్ ఈ సందర్భంగా క్లాడియో అన్సోరెనాకు వివరించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జాయింట్ సెక్రటరీ అర్వింద్సింగ్ తదితరులు పాల్గొన్నారు.