హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ టోర్నమెంట్లో అజయ్ భారతి, దీపక్, ప్రసాద్రావు, చాముండేశ్వరీనాథ్ విజేతలుగా నిలిచారు. టీ-స్పోర్ట్స్, టీగోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సులో జరిగిన ఈ ఈవెంటులో వంద మందికి పైగా గోల్ఫర్లు పాల్గొన్నారు. అండర్-15 విభాగంలో అజయ్ భారతి విజేతగా నిలువగా రుషీల్ రెడ్డికి రన్నరప్ దక్కింది. 16 ఏండ్లకు పైగా వయసు కేటగిరీలో దీపక్ సింగ్ టాప్లో నిలువగా, సమీర్ మహేంద్ర రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్ విజేతగా చాముండేశ్వరీనాథ్ టైటిల్ దక్కించుకోగా, జేపీ రెడ్డి రన్నరప్ కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత, హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీ స్పోర్ట్స్ చైర్మన్ ఏ జగన్మోహన్రావు, టీగోల్ఫ్ అధ్యక్షుడు ఎన్ఆర్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.