మడికొండలోని బాలికల గురుకుల కళాశాలలో గురువారం నుంచి జోనల్స్థాయి సైన్స్ఫేర్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ సూరినేని
విద్యారాణి తెలిపారు. గురుకులంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో జోన్-2లోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల గురుకులాల నుంచి 236 మంది విద్యార్థులు, 118 మంది గైడ్ ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆర్ట్ అండ్ లిటరేచర్, మ్యాచ్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ అనే అంశాలపై 118 ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్లు వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా ప్రారంభించనున్న సైన్స్ఫేర్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
– మడికొండ, నవంబర్ 23