ఇప్పటివరకు 5.81 లక్షల మందికి టీకా
మూడు రోజులుగా సెకండ్ డోస్పై స్పెషల్ డ్రైవ్
నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్
వరంగల్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. కేం ద్రం నుంచి సరిపడా నిల్వలు రాకపోయినా ప్రతి ఒక్కరికీ టీకా వేయాలనే లక్ష్యంతో నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ డోస్ వేసుకున్న ప్రతి ఒక్కరికీ నిర్ణీత గడువులోగా సెకండ్ డోస్ అందించేందు కు అందుబాటులో ఉన్న టీకాలను పూ ర్తిస్థాయిలో వినియోగించుకుంది. ఇం దుకోసం ఈ నెల 10, 11, 12న స్పెష ల్ డ్రైవ్ చేపట్టి 18వేల మందికి టీకా వేయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 5.81 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయగా, నేటి నుంచి ఫస్ట్ డోస్కో మళ్లీ ఏర్పాట్లు చేస్తోంది.
రెండు డోసులు పూర్తయిన వారిలో పూర్తిస్థాయిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా సోకినా ఎలాంటి ఇబ్బం ది ఉండదు. ఈ నేపథ్యంలో రెండో డోస్ వ్యాక్సినేషన్పై ఈ నెల 10, 11, 12న ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. మూడు రోజుల్లోనే ఆరు జిల్లాల్లో కలిపి దాదాపు 18 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. రెండో డోసు అవసరమైన ప్రతి ఒక్కరికీ వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా దీ న్ని కొనసాగిస్తున్నారు. రెండో డోస్తో పాటు గురువారం నుంచి మొదటి డో సును మళ్లీ మొదలుపెట్టాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి సరఫరా లేక వా రం రోజులుగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి మొదటి డోస్ వ్యాక్సిన్ను సమకూర్చింది. దీంతో ఆరు జిల్లాల పరిధిలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ మళ్లీ మొదలుపెట్టేందుకు ఆరోగ్య శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కో సం అనేక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభు త్వం పలు విధాలుగా ప్రయత్నిస్తోంది. చివరి అస్త్రంగా లాక్డౌన్ను అమల్లోకి తెచ్చింది. కరోనా టెస్టులు, వైద్య సేవలను నిరంతరంగా కొనసాగిస్తూనే వ్యాక్సినేషన్ను వేగంగా పూర్తి చేస్తోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కాగా జరుగుతోంది. ఆరు జిల్లాల్లో ఇప్పటివరకు 64,893 వ్యాక్సినేషన్ వాయిల్స్ వచ్చాయి. ఆరు జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 5,81,954 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. వీరిలో దాదాపు 35 శాతం మంది రెండో డోసు వ్యాక్సినేషన్ వేసుకున్న వారు ఉన్నారు. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఆరు జిల్లాల్లో కలిపి 147 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి పర్యవేక్షణ కోసం 50 హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వ్యాక్సిన్ను నిల్వ చేసేందుకు ఆరు జిల్లాల్లో కలిపి 21,993 లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు.