నేటి నుంచి అందుబాటులో సేవలు
రూరల్ జిల్లాలో 220 పడకలతో మూడు కేర్ సెంటర్లు
అదనపు ఆక్సిజన్ పడకలు
కలెక్టరేట్లో ఫ్రీ కాల్ సెంటర్: డీఎంహెచ్వో మధుసూదన్
వరంగల్రూరల్, మే 4(నమస్తేతెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పరకాల లో టెలీ మెడిసిన్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించింది. బుధవారం నుంచి ఇది పనిచేయనుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చల్లా మధుసూదన్ వెల్లడించా రు. పరకాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ)లో ఈ కేంద్రాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు ఇది పనిచేయనుంది. ఇద్ద రు వైద్యులు ఈ సెంటర్లో విధులు నిర్వర్తిస్తారు. కరో నా బాధితులకు ఫోన్ ద్వారా అనుమానాలను నివృత్తి చేస్తారు. వైరస్ సోకిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్త లపై సలహాలు ఇస్తారు. దవాఖానకు రాలేని, అత్యవ సర వైద్య సేవలు అవసరమైన వారు ఈ టెలీ మెడిసి న్ సెంటర్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు ఇది పనిచేస్తుందని డీఎంహెచ్వో తెలిపారు. దీనికితో డు హన్మకొండలోని రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాల యంలో బుధవారం నుంచి ఫ్రీ కాల్ సెంటర్ పనిచేయ నుందని ఆయన ప్రకటించారు. షిప్టు పద్ధతిన అధికా రులు, సిబ్బంది నిరంతరం పనిచేసి కరోనా బాధితుల కు సేవలందిస్తారని ఆయన చెప్పారు. కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్న దవాఖానలు, టెస్టులు, వ్యాక్సినేషన్ జరిగే కేంద్రాల వివరాలు చెప్పడంతో పా టు 108 వంటి అత్యవసర సర్వీసులకూ సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. ఫ్రీ కాల్ సెంటర్ నంబర్ 18004253424 అని వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ సెంటర్ను ఉపయోగించుకుని తమ సందేహాలు తీర్చుకోవాలని కోరారు.
మూడు కేర్ సెంటర్లు
కరోనా బాధితుల కోసం ప్రభుత్వం కొత్తగా మూడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట కేంద్రంగా సోమవారం నుంచి ఇవి పనిచే స్తున్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ఓ ప్రభుత్వ హాస్టల్ భవనంలో వంద పడకలతో కేర్ సెంటర్ పనిచేసేలా అధికారులు ఏర్పా ట్లు చేశారు. పరకాలలో మల్లక్కపేట ప్రభుత్వ గురుకు ల బాలికల కళాశాలలో 80 పడకలతో కేర్ సెంటర్, వర్ధన్నపేటలోనూ ఓ ప్రభుత్వ హాస్టల్లో 40 పడ కల తో కేర్ సెంటర్ పనిచేసేలా సోమవారం నుంచి సేవల ను ప్రారంభించారు. డిప్యుటేషన్పై వైద్యులు, సిబ్బంది ఈ సెంటర్లలో నియమితులయ్యారు. కరోనా సోకిన బా ధితుల్లో అద్దె ఇండ్లలో నివసించేవారు, సొంత ఇండ్లలో ఉండలేని, కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలను కునే వారు, దవాఖానల్లో చికిత్స పొందడానికి ఇష్టపడ ని వారు కేర్ సెంటర్లలో వైద్య సేవలు పొందవచ్చని డీఎంహెచ్వో తెలిపారు. మూడు కేర్ సెంటర్లలో 220 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు.
అదనపు ఆక్సిజన్ బెడ్స్
జిల్లాలో ప్రస్తుతం నర్సంపేట ఏరియా దవాఖానలో ఇరవై ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అద నంగా పరకాల, వర్ధన్నపేట సీహెచ్సీల్లో పదేసి ఆక్సిజన్ పడకలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. మరో మూడు నాలుగు రోజు ల్లో ఇక్కడ కరోనా బాధితులకు ఆక్సిజన్ లభించే సౌలత్ ఏర్పడనుందని డీఎంహెచ్వో తెలిపారు. సీహెచ్సీ, పీహెచ్సీల్లో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ఒకే ఆవర ణలో గాకుండా వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్టుల నిర్వహణకు ఇప్పటికే పలు పీహెచ్సీలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించారు.