హసన్పర్తి, జూన్ 24: నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సిద్దాపూర్కు చెందిన ముస్కు పెంటు ఇటీవల ఉపాధిహామీ పనికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబానికి మంజూరైన రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును శనివారం అరూరి అందించి మాట్లాడారు. నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇదే గ్రామానికి చెందిన గిరిధర్కు రూ. లక్ష, ముస్కు ఇందిరకు రూ. 53 వేలు, ముస్కు రాముకు రూ. 52 వేల విలువైన చెక్కులను వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అరూరి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీత, ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో విజయలక్ష్మి, సర్పంచ్ జనగాం ధనలక్ష్మి-కిరణ్, పీఏసీఎస్ చైర్మన్లు జక్కు రమేశ్గౌడ్, బిల్లా ఉదయ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెసరు శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ చీకటి రమేశ్, యూత్ విభాగం మండల అధ్యక్షుడు మేక భగవాన్రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని అర్వపల్లి, బైరాన్పల్లి గ్రామాలకు చెందిన మంచాల మల్లయ్య, బైరగోని రాములు, గర్గే సారయ్య, పిడుగు లక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు ఎమ్మెల్యే రమేశ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్లు తగరం జెన్నయ్య, కుందూరు సాంబారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ చిరంజీవి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే లాల్ ఉన్నారు.
నయీంనగర్: నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన దాట్ల నైనిక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నది. ఆమె ఆర్థిక పరిస్థితులను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్మే సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. లక్ష ఎల్వోసీని హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు.
కాశీబుగ్గ: గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ ఆరెపల్లిలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అందజేశారు. ఆరెపల్లిలో లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. బొమ్మగాని శ్రీనివాస్, సమ్మక్క, పైడిపల్లికి చెందిన మౌలానా, లతకు మొత్తం రూ. 1,07,500 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ అధ్యక్షుడు, వరంగల్ పీఏసీఎస్ డైరెక్టర్ నేరెళ్ల రాజు, బీఆర్ఎస్ నాయకులు జన్ను అనిల్కుమార్, షేక్ ఆదాం, బుద్దె వెంకన్న, శ్రీనివాస్, కోతిమీరు కుమార్, నర్సింగుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.