నయీంనగర్, డిసెంబర్ 3: ఈనెల 7 నుంచి 10వ తేదీ మధ్య బెంగుళూరు సిటీ యూనివర్సిటీలో జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ (పురుషుల)టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిని టి.సవితా జ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిలో సమ్మయ్య (ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, ఖమ్మం), ఆజాద్ (విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ, ఖమ్మం), ఎస్.కిరణ్కుమార్ (యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఖమ్మం), లక్పతి, రమేశ్, స్వామి (విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల, వరంగల్), అశోక్ (వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బొల్లికుంట), నవీన్ (కాకతీయ గవర్నమెంట్ కాలేజీ, హనుమకొండ), రంజిత్ కుమార్ (ఎల్ బీ కాలేజీ, వరంగల్), జాన్సన్ (యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ, హనుమకొండ), అఖిల్ (కేఏండీసీ ఖమ్మం), అజయ్కుమార్ (వాగ్దేవి డిగ్రీ కాలేజీ, హనుమకొండ), వీరికి కోచ్గా కిట్స్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు శ్రీనివాస్రెడ్డి, మేనేజర్గా విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కుమారస్వామి వ్యవహరిస్తారని వివరించారు.