హనుమకొండ, ఆగస్టు 21 : యువతరం వైద్యులకు నిరంతర అభ్యా సం, సాధన ఎంతో ముఖ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నా రు. శుక్రవారం హనుమకొండ కాళోజీ కళా క్షేత్రంలో నిర్వహించిన దక్షిణ భారత ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ సౌత్ ఇండియా ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ను వరంగల్లో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు వరంగల్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ (OASIS) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విజయ్చందర్రెడ్డి మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు, ఆర్థోపెడిక్ వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేరొన్నారు. కార్యక్రమంలో OASIS ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, OASIS ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్. కృష్ణ గోపాల్, సెక్రటరీ జనరల్ డాక్టర్ రోషన్ కుమార్, కో-ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. సుధీర్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాటం రామ్ కుమార్ రెడ్డి, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.