రాయపర్తి, ఫిబ్రవరి 4: పదో తరగతి వార్షిక పరీక్షల నూతన విధానంపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి గారె కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. రాయపర్తిలోని జడ్పీహెచ్ఎస్లో శనివారం టీచర్లకు పదో తరగతి వార్షిక పరీక్షల నూతన విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని 12 జడ్పీహెచ్ఎస్లు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కేజీబీవీలోని స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష పేపర్లు, సిలబస్, 100 శాతం ఫలితాలు, 10/10 జీపీఏ సాధనకు కృషి చేసే విధానంపై కృష్ణమూర్తి అవగాహన కల్పించారు.
పర్వతగిరి: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో మారిన ప్రశ్నపత్రాల విశ్లేషణ, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధులను చేసే విధానంపై ఆంగ్ల భాష రిసోర్స్ పర్సన్ ఎల్ వంశీమోహన్ అవగాహన కల్పించారు. ప్రశ్నపత్రాల సరళి, ప్రశ్నపత్రం పట్టిక, నమూనా ప్రశ్నపత్రం తదితర అంశాలను వివరించారు. తెలుగు భాష రిసోర్స్పర్సన్ డాక్టర్ మడత భాస్కర్ పద్యగద్య భాగాల ప్రశ్నలు, పాఠ్య పుస్తకేతర అంశాలపై వివరించారు. హిందీ భాషలో రిసోర్స్ పర్సన్ మహ్మద్ అజారుద్దీన్ వివరించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి లింగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఎండీ జలీల్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి చెరుకు శ్రీధర్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ప్రశ్నపత్రాలపై అవగాహన
చెన్నారావుపేట: చెన్నారావుపేటలోని హైస్కూల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలపై అవగాహన కల్పించారు. రెండు రోజుల శిక్షణలో భాగంగా మొదటి రోజు శనివారం తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టులపై అవగాహన కల్పించారు. ఆదివారం గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై అవగాహన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ గుండు రవి, అనుపమ, కిశోర్, ఉపాధ్యాయులు నిర్మలాదేవి, కుమారస్వామి, వీరస్వామి, మురళి, తేజస్విని, హేమదేవి, విజయలక్ష్మి, మమత, సునీత, రమణారావు, రవీందర్, శేఖర్, మంజుల, సరిత, జయశ్రీ, వీరబాబు, సహీమ, భాగ్యలక్ష్మి, సీఆర్పీ సంపత్ పాల్గొన్నారు.
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
గీసుగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని కార్పొరేటర్ ఆకుపల్లి మనోహర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెన్త్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతోపాటు 10/10 జీపీఏ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం పాక రమేశ్బాబు, ఉపాధ్యాయులు ప్రవీణ్, బరుపట్ల స్వామి, మధు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.