హన్మకొండ సిటీ, మే 23 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రధాన మార్గాలోనే కాదు.. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలనీల్లో కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టింది. పెట్రోలింగ్ సిబ్బందిని రంగంలోకి దింపింది. వివిధ పోలీస్స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన సిబ్బందితో ప్రత్యేక టీంలు సిద్ధం చేసి, బైకు పెట్రోలింగ్తో గల్లీల్లో దృష్టి సారిస్తున్నారు. అదివారం సాయంత్రం ప్రత్యేక బైకు పెట్రోలింగ్ బృందాలను స్టేషన్ఘన్పూర్ ఏఎస్పీ, బైకు పెట్రోలింగ్ ఇన్చార్జి వైభవ్ గ్వైక్వాడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వైభవ్ మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు ఉదయం 10 దాటగానే గల్లీల్లోకి ప్రవేశించి, రోడ్డుపైకి వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేస్తారన్నారు. కూడళ్లలో మైకుల ద్వారా లాక్డౌన్పై మరింత అవహగాన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ సీఐ చంద్రశేఖర్, ప్రోబిషనరీ ఎస్సై శివకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.