వరంగల్ చౌరస్తా, జూన్ 4 : కరోనాకు తోడు లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సోడాబండి కార్మికులకు దాతలు సాయం చేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్లోని జేపీఎన్ రోడ్డులో సోడాబండ్లు నడుపుతున్న సుమా రు 60 మంది కార్మికులకు 25 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేయడంతోపాటు నిత్యావసర సరుకులను ఆయన అందించారు. ఈ సందర్భంగా శ్రీహ రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు సహాయం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. కరోనా నియంత్రణలో ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని ఈ సందర్భంగా శ్రీహరి కోరారు.