వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 3 : గ్రేటర్ వరంగల్ 36వ డివిజన్ పరిధిలోని చింతల్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పంచాయత రామలింగేశ్వరస్వామి, లలితా త్రిపురసుందరి దేవి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం దేవాలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ ప్రధనార్చకులు డింగరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహిస్తామన్నారు. బ్రహ్మశ్రీ ఉప్పునూతల గురుసాయి ఆచార్యుల చేతు ల మీదుగా యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు.
గురువారం రాత్రి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కలిసి కమిటీ ప్రతినిధులు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆడెపు వెంకటేశ్, ఆలయ కమిటీ సభ్యులు జూలపల్లి వెంకటరామ సుగుణాకర్ రావు, అంకతి చంద్రశేఖర్, తుంగ విజయ్కుమార్, సిద్ధ రాజు, గుండేటి రాజు, అనుమాండ్ల రాజు, మర్రి శ్రీనివాస్, స్థానిక నాయకుడు వేల్పుగొండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.