హనుమకొండ, ఆగస్టు 1 : హనుమకొండ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలపై ప్రజలు, తల్లులు, గర్భిణులు, బాలింతల కు అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ జారీ చేసింది. ఈ సంవత్సరం ‘ఉద్యోగ మహిళలు తమ పిల్లలకు తల్లిపాలు అందించేలా ప్రోత్సహించాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల ప్రాజెక్టుల పరిధిలో 781 అంగన్వాడీ కేంద్రాల ఉన్నాయి. వీటిలో 4600 మంది గర్భిణు లు, 6800 మంది బాలింతలు ఉన్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఈ నెల 7 వరకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం స మావేశాలే కాకుండా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఇంటింటికీ ప్రచారం చేపట్టడంతో పాటు ర్యాలీలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 7వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్, ఏఎన్ఎంలు అవగాహన కల్పించనున్నారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించేలా, 6 నెలల వరకు చిన్నారికి కేవలం తల్లిపాలు మాత్రమే ఇ వ్వాలని, ఏడు నెలల నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ అదనపు పోషకాహారం అందించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తల్లిపాలపై ఉన్న అపోహాలు తొలగించి అలవాట్లలో మార్పును తెచ్చేలా ప్రోత్సహించడంతోపాటు పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే జరిగే అనర్ధాలపై అవహాన కల్పించనున్నారు. ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖ భాగస్వామ్యంతో దవాఖానలను సందర్శించి అక్కడ తల్లితో పాటు సహాయకులుగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ఇంటింటికీ ప్రచా రం, ర్యాలీలు నిర్వహించనున్నారు. అలా గే, సరైన పాటించిన తల్లిదండ్రులకు సన్మానాలు, సత్కారాలు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, స్థానికులతో కలిసి కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆశ వర్కర్, ఏఎన్ఎం, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి, గృహ సందర్శన, కౌన్సెలింగ్ ద్వారా అపోహలు తొలగించి, తల్లిపాలను కొనసాగించేలా తల్లులకు అవగాహన కల్పించనున్నారు. అలా గే, రేడియో, టీవీ, సామాజిక మాధ్యమాల్లో కూడా విసృ్తత ప్రచారం చేయనున్నారు. మండలం, జిల్లా స్థాయిలో మహి ళా సమాఖ్య సభ్యులు, గ్రామైక్య సంఘాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పు లు, ముర్రుపాలు పట్టించిన వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. అలాగే, ప్రైవేట్ దవాఖానలో తల్లిబిడ్డల సంరక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ద్వారా సిబ్బంది నిరంతర కౌన్సెలింగ్ చేపట్టి తల్లిపాల విశిష్టతను తెలియజేయనున్నారు.
నడికూడ : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సీడీపీవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీడీపీవో మా ట్లాడుతూ ముర్రుపాలతో పిల్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నారగాని అనిత, దుప్పటి సంపూర్ణ, దుప్పటి వినోద, కళావతి పాల్గొన్నారు.
జిల్లాలో వారం రోజుల పాటు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి. తల్లిపాలను పోత్సహించేలా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని కార్యక్రమం విజయవంతమయ్యేలా తీసుకోవాలని సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు ఆదేశించాం.
-కె. మధురిమ, జిల్లా సంక్షేమాధికారి, హనుమకొండ