ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్య పండుగను జరుపుకొన్నారు. కేక్ కటింగ్ చేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఏసు ప్రభువును కొలుస్తూ పాటలు పాడారు. పాస్టర్లు, మత పెద్దలు ఏసుక్రీస్తు శాంతి సందేశాన్ని వినిపించారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. చర్చిల వద్ద క్రిస్టియన్లు సరదాగా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, కాజీపేట ఫాతిమా నగర్లోని కెథడ్రల్, కరు ణాపురంలోని క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం, డోర్నకల్లోని సీఎస్ఐ, యశ్వంతాపూర్లోని షాలోమీ బాప్టిస్టు, తదితర చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ, ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పాల్గొనగా, ఆయా చర్చిల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.