దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కుకోగా, ఇప్పుడు మరో తనయుడు వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నాడు. శ్రీ రెడ్డి వివాదంతో వార్తలలోకి ఎక్కిన అభిరామ్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో రూపొందుతున్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంకు సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.
తేజ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ చేస్తున్నానని.. అందులో తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయని దగ్గుబాటి వారసుడు అభిరామ్ కొద్దిరోజుల క్రితం స్వయంగా తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలో అభి సరసన కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఒక ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ఫేమస్ అయిన ఈమెను ఇండస్ట్రీకి తీసుకురావాలని కృతి ఎప్పటి నుండో ట్రై చేస్తుంది. అభిరామ్ సినిమాతో అయిన నూపూర్ వెండితెర ఎంట్రీ ఇస్తుందా చూడాలి.