ఆసిఫాబాద్, మార్చి 16 : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పారోపటర దాన్నేగావా గ్రామంలో నిర్వహించే ‘జై లింగో జై జంగో’ వేడుకలకు మంగళవారం బయల్దేరారు. ఈ సందర్భంగా పర్ధాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. సుమారు 30 మంది ఆదివాసులు బయల్దేరినట్లు సుధాకర్ తెలిపారు. దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ సంప్రదాయ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాయిసెంటర్ సర్మేడి యశ్వంత్రావు, మెంగారావు తదితరులు పాల్గొన్నారు.