రూ.60 వేలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం
వెల్లడించిన మానుకోట ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, ఏప్రిల్ 30 : జిల్లాకేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ ల్లో బెట్టింగ్ పాల్పడుతున్న వారి వివరాలను వెల్లడించారు. హన్మంతునిగడ్డ ప్రాంతంలో వినియోగంలో లేని మదర్థెరిసా స్కూల్లో శుక్రవారం కొంతమంది బెట్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన బత్తిని ఉదయ్, బయ్య రాంప్రసాద్, శివాలయం వీధికి చెంది న మౌర్య శ్రీను, కుంట సాగర్, ఏనుగుతల ఉమేశ్, శ్రీనగర్కాలనీకి చెందిన కర్ణం సంప్రీత్ బెట్టింగ్కు పాల్పడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిని చాకచచక్యం గా పట్టుకున్న తీసుకున్న టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఎస్సై సంతోశ్, అరుణ్కుమార్, సిబ్బంది రమేశ్, బాలరాజు, వెంకన్నను ఎస్పీ అభినందించారు.