నగర వీధుల్లో ఎక్కడా చెత్త కనిపించొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో శుక్రవారం మేయర్ పర్యటించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఆరోరోజు మేయర్ కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల లో జోనల్ కమిషనర్లు మమత, రవికిరణ్లతో కలిసి ఆకస్మిక పర్యట న చేశారు. పారిశుధ్య పనులను, డంపింగ్ యార్డులను అధికారులతో కలిసి పరిశీలించారు. కూకట్పల్లి జోన్లోని బాలాజీనగర్, కైత్లాపూర్ డంపింగ్ యార్డ్తో పాటు జగద్గిరిగుట్ట హెచ్ఎంటీ పైపులైన్ రోడ్డులోని డంపింగ్ యార్డులను మేయర్ సందర్శించారు. కైత్లాపూర్ డంపింగ్ యార్డుకు వెళ్లే రోడ్డులో దాదాపు కిలోమీటర్ వరకు అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులకు మేయర్ సూచించారు. అక్కడున్న సీటీపీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచి చెత్త ఆటోలు వెయింటింగ్లో లేకుండా చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగియగా నే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేయనున్నామని మేయర్ తెలిపారు. జగద్గిరిగుట్ట హెచ్ఎంటీ కాలనీ పైపులైన్ రోడ్డులోని డంపింగ్ యార్డు వద్ద మురుగునీరు, పేరుకుపోయిన చెత్తను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్లు జగన్, సత్యనారాయణ, శేషగిరిలు డివిజన్ సమస్యలు మేయ ర్ దృష్టికి తీసుకు రాగా, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.