వికారాబాద్ : నూతనంగా నియమితులైన వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మురళీకృష్టగౌడ్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ శాలువాతో సన్మానం చేశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో గౌడ్లకు సముచిత స్థానం లభిస్తుందన్నారు.