Vikarabad
- Jan 20, 2021 , 00:27:22
VIDEOS
రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలువండి..

కొడంగల్, జనవరి 19 : రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ భాన్జీ ఖేరాజ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి విజయ్ తెలిపా రు. శుక్రవారం జియో లైఫ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో శాంతినగర్కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనేది ఆపత్కాలంలో ఓ నిం డు ప్రాణాన్ని కాపాడుతుందని, అటువంటి ప్రాముఖ్యత గల రక్తదానం కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రూ ప్రోత్సహించాలన్నారు. రక్తం అందించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావన్నారు. సంవత్సరంలో ఓసారి తప్పక రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో నాయకులు పున్నచంద్ లాహోటీ, ఆనంద్కుమార్ లాహోటీ, నేహాలాహోటీ, కృష్ణాయాదవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
MOST READ
TRENDING