మానవుడి మెదడులో చిప్ ఇన్సెర్ట్ సక్సెస్ అయ్యింది. మనిషి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించేందుకు అమర్చినట్లు టెస్లా సీఈవో ఎలాన్మస్క్ తెలిపారు. స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ ఆధ్వర్యంలో మనిషి మెదడులో విజయవంతంగా చిప్ను ఇన్స్టాల్ చేసింది. మానవుడి మెదడుకు, కంప్యూటర్కు మధ్య నేరుగా సంబంధాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలుస్తున్నది. ఇందుకు న్యూరోటెక్నాలజీ సంస్థ 2016 నుంచి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ ఫలితాల్లోనే న్యూరాన్ స్పేక్ డిటెక్షన్ను గుర్తించినట్లు చెప్పారు. మానవుడి మెదడులో చిప్ అమర్చేందుకు గత ఏడాది మేలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్త్రేషన్ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే బ్రెయిన్ యంత్రం ఇంటర్ ఫేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసంతో కూడిన చిప్లో సన్నని ఎలక్రోడ్స్ ఉంటాయని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిప్ మందం ఎంతంటే వెంట్రుకలో 20శాతం మాత్రమే. పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి ఈ చిప్ను అమర్చుతారని వివరించారు. ఎంతైనా శస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందేక్రమంలో రోబోలా యుగం రాబోతుందని అంచనా వేయొచ్చు. మున్ముందు కళియుగం ఎలా ఉండబోతోందో ఇక మనం అంచనా వేయడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.