సికింద్రాబాద్ను చాలామంది చుట్టేసి ఉంటారు. కానీ ఇక్కడ ఓ చారిత్రాత్మక మెట్లబావి ఉందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది చెత్తతో కూడుకుపోయి కనిపించకుండా పోయింది. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్లబావులను పునరుద్ధరించేందుకు నడుంబిగించాయి. ఇందులోభాగంగా బన్సీలాల్పేట బావి పునరుద్ధరణ పనులు ఏడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ఇప్పుడా బావి అందంగా ముస్తాబైంది. చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే నమ్మండి.