నేటిరోజుల్లో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఓ మోస్తరు రోగానికి కూడా లక్షల బిల్లులు వేస్తున్నారు. ఏ శస్త్రచికిత్సో అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కానీ, ఆ క్లినిక్లో మాత్రం.. పది రూపాయలకే వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే రాయితీతో సర్జరీలూ చేయిస్తారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పరిసరాల్లో ‘పది రూపాయల దవాఖాన’ పేదల హృదయాలను గెలుచుకుంటున్నది.