Viral Video : క్రికెట్ చూడడమే కాదు మ్యాచ్ ఆడేటప్పుడు రూల్స్ని కూడా చాలామంది పక్కాగా పాటిస్తారు. అది గల్లీ క్రికెట్ అయినా సరే రూల్ అంటే రూలే అన్నట్టు ప్రవర్తిస్తారు. కొంతమంది పిల్లలు కూడా అదే చేశారు. కొంతమంది పిల్లలు గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికి బ్యాట్స్మన్ను అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి అంపైర్ నిర్ణయంతో ఏకీభవించడు. అతను అంతర్జాతీయ మ్యాచ్ల లాగానే డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టం) తీసుకుంటాడు. అయితే, ఆ మ్యాచుల్లో కెమెరాలు ఉంటాయి బంతి ఎటు వెళ్లింది అనేది రీప్లేలో తెలుస్తుంది. కెమెరా లేదు గనుక వీళ్లు బంతి బ్యాట్కు తాకిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు వీళ్లు ఏం చేశారో తెలుసా?
బంతి బదులు ఒక చిన్న పిల్లాడిని డీఆర్ఎస్ కోసం ఉపయోగించారు. ఆ పిల్లాడు నెమ్మదిగా బ్యాట్ పట్టుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అతడి కాళ్ల సందులోంచి బయటకు వెళ్తాడు. గాడ్మన్ చిక్నా అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టాడు. ఇప్పటికే 14వేల మందికిపైగా ఈ వీడియో చూశారు. వీడియో చూసినవాళ్లంతా ఈ పిల్లల క్రియేటివిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పిల్లల్ని వచ్చే వరల్డ్ కప్ ఆడనిస్తారా? అంటూ మరికొందరు ఈ వీడయోకు ఐసీసీ, బీసీసీఐని ట్యాగ్ చేశారు.
What kind of cricket is this 😂 DRSb pic.twitter.com/D08zTbuGtQ
— Godman Chikna (@Madan_Chikna) November 30, 2022