వారిద్దరూ భార్యభర్తలు.. ఒకరిపై ఒకరికి ప్రేమ. కానీ అకస్మాత్తుగా వారి దేశంపై యుద్ధం వచ్చింది. భర్త స్వచ్ఛందంగా దేశసేవకోసం గన్పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్లిపోయాడు. భార్య శరణార్థిగా వేరేదేశం వెళ్లిపోయింది. ఎప్పుడూ విడిచి ఉండనివారు యుద్ధం వల్ల చాలారోజులు విడిగా ఉండాల్సి వచ్చింది. తాజాగా, ఈ జంట ఎల్వివ్లో కలుసుకొని బాంబు మోతల నడుమే మళ్లీ పెళ్లి చేసుకుని తమ ప్రేమకు అపజయం లేదని చాటిచెప్పింది.
కోస్టియంటిన్ పోలిషుక్కు 47 ఏళ్లు. అతడి భార్య హలీనా పోలిషుక్కు 41 ఏళ్లు. ఇద్దరూ ఉక్రెయిన్ దేశంలోని కీవ్లో ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడిపేవారు. అయితే, అకస్మాత్తుగా రష్యా.. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది. బాంబులు విసిరి రక్తపాతం సృష్టించింది. కాగా, కోస్టియంటిన్ స్వచ్ఛందంగా ఉక్రెయిన్ ఆర్మీలో పనిచేసేందుకు భార్య హలీనాను వదిలివెళ్లాడు. హలీనా శరణార్థిగా జర్మనీ వెళ్లిపోయింది.
వాళ్లిద్దరూ కలుసుకుని మరోసారి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎల్వివ్లో కలుసుకొని పెళ్లిచేసుకున్నారు. ఫొటోషూట్ కూడా చేశారు. అనంతరం కోస్టియంటిన్ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లిపోయాడు. హలీనా మళ్లీ జర్మనీ వెళ్లిపోనుందని కోస్టియంటిన్ తెలిపాడు. తన భర్త క్షేమంగా ఉండాలని ప్రతిరోజూ ప్రార్థించినట్లు హలీనా పేర్కొంది. అలాగే, దేశపౌరుడిగా ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో ఉన్నందుకు తనకు గర్వంగా ఉందని చెప్పింది.
LOVE TRIUMPHS AMID WAR
A couple separated by #RussiaUkraineWar reunited to get married in the city of #Lviv yesterday. pic.twitter.com/vY6W8mTYaM— Mirror Now (@MirrorNow) April 11, 2022