రాయ్పూర్: ఒక వివాహ విందుకు పిలువని అతిథులు వచ్చారు. ఒక ఎలుగుబంటి రెండు పిల్లలను వెంటబెట్టుకుని ఫంక్షన్ హాల్కు వచ్చింది. అయితే ఆ వేడుక పూర్తయ్యాక అవి రావడంతో ఎవరికీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. వేడుక అనంతరం వధువరులతోపాటు, ఆహ్వానితులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఆ రాత్రి వేళ అనుకోని అతిథి ఆ ఫంక్షన్ హాల్కు వచ్చింది. ఒక ఎలుగుబంటి తన వీపుపై రెండు పిల్లలను ఉంచుకుని రిసెప్షన్ వేదిక పైకి వెళ్లింది. అక్కడ వాసన చూసి అటు ఇటు తిరిగింది. కొంత సేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే వధువరులతోపాటు వేడుకకు వచ్చిన వారంతా అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ ఎలుగుబంటి వల్ల ఎవరికీ ఎలాంటి ముప్పు కలుగలేదు.
మరోవైపు ఆ సమయంలో ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న సిబ్బంది ఎలుగుబంటి రాకను గమనించారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. అది ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా పలు కామెంట్లు చేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ కూడా వీడియోను షేర్ చేశారు. ‘బహుశా.. విందు ఏర్పాట్లు వాటికి నచ్చలేదు’ అని క్యాప్షన్ పెట్టారు.
They are not happy with the arrangement. It seems. https://t.co/9Af4fErhdb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 16, 2022