రక్త సంబంధీకులు ఎవరైనా చనిపోతే.. మనం తట్టుకోలేం. తల్లడిల్లిపోతాం. కొన్ని రోజుల వరకు బాధపడుతూనే ఉంటాం. మనకు దగ్గరగా ఉన్నవాళ్లు, మనతో కలిసిపోయిన వాళ్లు, కలిసి తిరిగిన వాళ్లు, మనతో ఎక్కువ సమయం గడిపిన వాళ్లు దూరమైనా అంతే బాధ పడతాం. కొన్నిరోజుల వరకు నిద్ర కూడా పట్టదు. అదే ధ్యాసలో ఉంటాం. తీవ్ర భావోద్వేగానికి గురవుతాం.
కొందరు తమ బాధను, భావోద్వేగానికి ఆపుకోలేక.. ఎవరితోనైనా పంచుకుంటారు. అమెరికన్ ఫేమస్ ర్యాపర్.. కిడ్ కుడి కూడా తన బాధను తట్టుకోలేక.. ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆయన ఎంత అంత భావోద్వేగానికి గురయ్యాడంటే.. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్.. ఇటీవలే చనిపోయిందట. దీంతో అతడు తట్టుకోలేకపోయాడట. తన పెట్ డాగ్ ఫ్రెషీ ఇక లేదని తెలిసి.. ఏడుపు ఆగలేదట. 2010 నుంచి ఆ పెట్ డాగ్ అతడితోనే ఉందట. దాదాపు 11 ఏళ్లు.. తనతో గడిపి.. ఇప్పుడు అది లేదు.. అనే విషయాన్ని కిడ్ కుడి జీర్ణించుకోలేకపోతున్నట్టు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చెప్పుకొచ్చాడు.
నా బాధను నేను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నా. ఫ్రెషీ అంటే నాకు ఎంత ఇష్టమో ఈ వేదికగా చెబుతున్నా. నెటిజన్లు.. దయచేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి.. అని కిడ్ కోరాడు. ప్రస్తుతం కిడ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, తన ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు.. కిడ్ కుడిని కామెంట్లలో ఓదార్చారు. ఫ్రెషీ.. స్వర్గానికే వెళ్తుంది.. రిప్.. ఫ్రెషీకి ఇలా జరగడం నిజంగా బాధాకరం.. రెస్ట్ ఇన్ పీస్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.