IRCTC Karimnagar to Tirupati | ఈ వేసవిలో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే భక్తులకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్ ’(Sapthagiri Ex Karimnagar) పేరిట కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు(Train Route) మార్గంలో ఈ టూర్ను ఆపరేట్ చేస్తుండగా.. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్ ’ (Sapthagiri Ex Karimnagar) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. జూన్ 1వ తేదీన ఈ ప్యాకేజీ (Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుచానూర్ (Tiruchanuru), కాణిపాకం (Kanipakam), తిరుపతి(Tirupati), తిరుమల(Tirumala), శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. కరీంనగర్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు కరీంనగర్లో టూర్ ప్రారంభం అవుతుంది. కరీంనగర్ (Karimnagar) నుండి రాత్రి 07.15 గంటలకు రైలు బయలుదేరుతుంది. పెద్దపల్లి(Peddapalliki)కి రాత్రి 8.05 గంటలకు చేరుకుంటుంది. వరంగల్ (Warangal) నుంచి రాత్రి 9.15 గంటలకు, ఖమ్మం(Khammam) నుంచి రాత్రి 11 బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ( Overnight Journey) ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 07:50 గంటలకు తిరుపతి (Tirupati)కి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శనకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. అనంతరం హోటల్కి తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత రాత్రి తిరుపతిలో బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. హోటల్(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. అనంతరం వేంకటేశ్వర స్వామి ( Lord Venkateswara) ప్రత్యేక ప్రవేశ దర్శనం( Special Entry Darshan) కోసం ఉదయం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . తిరుగు ప్రయాణంలో రాత్రి 08.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 4: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం చేరుకుంటారు, వరంగల్కు 04.41 గంటలకు, పెద్దపల్లికి 05.55 గంటలకు, కరీంనగర్కు ఉదయం 08.40 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్ ’ టూర్ ప్యాకేజీ ధర ( Sapthagiri Ex Karimnagar)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.9,010 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 7,640, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.7,560గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7120గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5740, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5660గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం. రైలు టికెట్లు, హోటల్లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR005