IRCTC Hyderabad to Tirupati Package | వేసవిలో సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమల, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, వెళ్లాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ‘పూర్వ సంధ్య’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. రైలు మార్గంలో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు.
పూర్వ సంధ్య (POORVA SANDHYA ) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 11 నుంచి ఈ ప్యాకేజీ (POORVA SANDHYA Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుచానూర్ (Tiruchanuru), శ్రీకాళహస్తి (Srikalahasti), కాణిపాకం (Kanipakam), తిరుపతి(Tirupati), తిరుమల(Tirumala), శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ పూర్వ సంధ్య ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. లింగంపల్లి (Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 05:55 గంటలకు తిరుపతి (Tirupati)కి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శనకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. అనంతరం హోటల్కి తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత రాత్రి తిరుపతిలో బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. హోటల్(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. అనంతరం వేంకటేశ్వర స్వామి ( Lord Venkateswara) ప్రత్యేక ప్రవేశ దర్శనం( Special Entry Darshan) కోసం ఉదయం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . తిరుగు ప్రయాణంలో సాయంత్రం 06:25 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 4: నల్గొండకు ఉదయం 03:04 గంటలకు చేరుకుంటారు, సికింద్రాబాద్కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ ధర ( POORVA SANDHYA )
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.9,570 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 7,720, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.7,510గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5660గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం. రైలు టికెట్లు, హోటల్లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR083