Telangana Tourism | ఈ వేసవిలో శ్రీశైలం టూర్ వెళ్లాలని ఉందా? అయితే మీకోసం తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశైలం(Hyderabad to Srisailam Tour)లోని మల్లికార్జున స్వామి (Mallikarjuna swamy), భ్రమరాంబదేవి (Bramarambikadevi) దర్శనం, పాతాళగంగా(Pathalaganga), పాలధార(Paaladhara), పంచధార (Panchadhaara), శిఖరం(Shikaram) మరియు శ్రీశైలం ఆనకట్ట(Srisailam Dam) తదితర ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీని ప్రకటించింది.
హైదరాబాద్ టూ శ్రీశైలం (DAILY SRISAILAM TOUR) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతిరోజు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో మల్లికార్జున స్వామి (Mallikarjuna swamy), భ్రమరాంబదేవి (Bramarambikadevi) దర్శనం పాతాళగంగా (Pathalaganga), పాలధార(Paaladhara), పంచధార (Panchadhaara), శిఖరం (Shikaram) మరియు శ్రీశైలం ఆనకట్ట(Srisailam Dam) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 1 రాత్రి, 2 రోజులు కొనసాగుతుంది. ప్రతిరోజు హైదరాబాద్ పర్యాటక భవన్, బషీర్బాగ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
శ్రీశైలం ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు పర్యాటక భవన్ నుంచి లేదా బషీర్బాగ్ నుంచి (09.00 గంటలకు) బస్సు బయలుదేరుతుంది. . మధ్యాహ్న భోజనానికి మార్గంలో స్టాప్ ఉంటుంది. భోజనం తర్వాత మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (పర్యాటకులు సాయంత్రం లేదా తెల్లవారుజామున దర్శనం చేయవలసి ఉంటుంది.)
గమనిక: శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించబడవు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాలి
Day 02: రెండో రోజు ఉదయం దర్శనం అనంతరం అల్పాహారం చేసి.. హోటల్ నుండి చెక్ అవుట్ తర్వాత రోప్ వే, పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Srisailam Tour cost | AC బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది. అదే నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, దర్శనం, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
గమనిక: రవాణా, వసతి ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/srisailamtour