Hyderabad to Coastal Karnataka Tour | ఈ వేసవిలో కర్ణాటక టూర్ వెళ్లే పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. కోస్టల్ కర్నాటక (Coastal karnataka) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. రైలు మార్గంలో ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
కోస్టల్ కర్నాటక (Coastal karnataka) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 16 నుంచి ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ (Coastal karnataka Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉడుపి (Udupi), శృంగేరి (Srungeri), మురుదేశ్వర్ (Murudeshwar), గోకర్నా (Gokarna), జోగ్ వాటర్ ఫాల్స్ (Jog falls) తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ కోస్టల్ కర్నాటక ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు ఉదయం హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు రైలు (కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్) బయలుదేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.
Day 2: రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉడిపికి చేరుకుని.. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత శృంగేరి శారదాంబ ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
Day 3 : మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. కొల్లూరు(kollur), ముకాంబికా ఆలయాలను సందర్శిస్తారు. తర్వాత మురుదేశ్వర్కు చేరుకుంటారు. రాత్రి మురుదేశ్వర్లో బస ఉంటుంది.
Day 4: నాలుగో రోజు ఉదయం మురుదేశ్వర్ ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ నుంచి జోగ్ వాటర్ ఫాల్స్(JOG Falls) కు వెళతారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన ఉంటుంది. అనంతరం తిరిగి మురుదేశ్వర్కు చేరుకుంటారు. రాత్రి మురుదేశ్వర్లో బస ఉంటుంది.
Day 5 : ఐదో రోజు ఉదయం మంగళూరుకు చేరుకుని. కతీల్ ఆలయం (Kateel Temple), మంగళా దేవి ఆలయాలను (Mangala Devi Temple) సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు రైలులో( train No. 12790) తిరుగు పయనం అవుతారు.
Day 6 : ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ కోస్టల్ కర్నాటక ప్యాకేజీ ధర (Coastal karnataka)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.34,270 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 19,570 ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.15,550గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 31,270గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 16,750, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.12,500గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085